General News

కేరళలో మరో వైరస్ కలకలం.. ఆ పండు తినడం వల్లనే ఆ వైరస్ సోకుతుందా..?

కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనాతో ఇప్పటికే విలవిలలాడిన జనాలకు ఈ వైరస్ తో ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆగస్టు 27 న కోజికోడ్ లోని చాత్తమంగళం పంచాయతీ పరిధిలోని ఓ 12 ఏళ్ల బాలుకి జ్వరం వచ్చింది. వాళ్లు మామూలు జ్వరం అనుకొని వారికి దగ్గరల్లో ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లారు.

కానీ ఆ బాలుడికి జ్వరం తగ్గలేదు. తర్వాత వాళ్లు అక్కడ నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి చికిత్స ఇస్తున్నప్పటికీ జ్వరం మాత్రం తగ్గలేదు. చివరకు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడిని నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది. వెంటనే వైద్య బృందంతో అతడు ఉంటున్న పరిసరాల్లోకి వెళ్లి పరిశీలించారు.

అతడి తల్లిదండ్రులు మాత్రం.. తన కుమారుడు రంబుటాన్ పండ్లను తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో వైద్యబృంద సభ్యులు బాలుడి ఇంటికి సమీప ప్రాంతాల్లో ఉన్న రంబుటాన్ పండ్లను నమునాలను సేకరించింది. తర్వాత అతడికి దగ్గరి కాంటాక్ట్ ఉన్న 8 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లుగా మొత్తం 251 మందిని వైద్య అధికారులు గుర్తించారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. చాత్తమంగళం పంచాయతీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను నిర్భదంతో ఉంచి.. పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నారు అధికారులు. ఎప్పటికిప్పుడు ఆ బాలుడి కాంట్రాక్ట్ ట్రేసింగ్ లను గుర్తించే పనిలో ఉన్నామని.. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

1 minute ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

24 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

54 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

2 hours ago