Ramcharan: మెగా పవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న g20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.మే 22 నుంచి మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్లో ఉన్నాయి. కాశ్మీర్ లాంటి అందమైన లొకేషన్లో ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని రామ్ చరణ్ తెలియజేశారు.
మన ఇండియాలో కేరళ కాశ్మీర్ వంటి ఎన్నో ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయని ఈ ప్రాంతాలన్నింటిని తాను సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని చరణ్ తెలిపారు.ఇకపై లొకేషన్ ల కోసమే ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు.
ఇక తాను భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు చేసిన హాలీవుడ్ దర్శకులకు కూడా తాను ఇదే కండిషన్ పెడతానని, హాలీవుడ్ దర్శకులకి కూడా ఇండియాలో ఉండే ప్రకృతి అందాలను చూపిస్తాను అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలో నార్త్ సౌత్ అని రెండు సినిమాలు లేవు ఉన్నది ఒక్కటే అది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…