Ramoji Rao: రామోజీరావు పరిచయం అవసరం దేని పేరు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన మన దేశంలోనే అత్యంత కుబేరులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీరావు మొట్టమొదటి పత్రిక రంగాన్ని స్థాపించి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.
ఇలా ఈనాడు పత్రిక రంగంలో విజయం అందుకున్న ఈయన అనంతరం ఈటీవీ చానల్స్ తో పాటు రామోజీ ఫిలిం సిటీని కూడా ప్రారంభించారు అప్పటి ప్రభుత్వ అధికారులకు సన్నిహితులైనటువంటి ఈయన కొన్ని వేల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చే విధంగా మార్చుకున్నారు. దీంతో వేల ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు.
ఇలా రామోజీ ఫిలిం సిటీలో మన దేశంలోనే కాకుండా హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్ జరుపుకునేలా దీనిని తీర్చేదిద్దారు. దీనితోపాటు ఈటీవీ చానల్స్ ప్రియా పచ్చళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ వంటి ఎన్నో వ్యాపార సంస్థలను ప్రారంభించి భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారు. ఇక ఈయన ఆస్తుల వివరాలు లెక్కలేయాలి అంటే కూడా కష్టతరం అనే చెప్పాలి.
పలు నివేదికల ప్రకారం రామోజీరావు నికర ఆస్తులు విలువ సుమారు 46 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మరి ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించిన రామోజీరావు మరణం తర్వాత ఆయన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రామోజీరావుకి కిరణ్, సుమన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సుమన్ 2012 సంవత్సరంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
తన వారసులు..
ఇక ఈయన మరణించే సమయానికి రామోజీరావు కొంత ఆస్తులను తన ఇద్దరు కుమారుల పేరా రాశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుమన్ పిల్లలు కూడా ఈ ఆస్తికి వారసులని తెలుస్తుంది. ఇలా రామోజీరావు తర్వాత తన ఆస్తిని తన ఇద్దరు పిల్లలకు చెందుతుందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…