భీమ్లా నాయక్ నుంచి మరో అప్డేట్.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్.. మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదో రేంజిలో ఉంటుంది. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా తెగ వైరల్ అవుతుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భీమ్లానాయక్ నుంచి ఒక సాంగ్ విడుదల కాగా అది పెద్ద వైరల్ గా మారింది. కొన్ని మిలియన్లకొద్ది వ్యూస్ కూడా సొంతం చేసుకుంది. ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

అయితే ఆ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. అందేంటంటే.. ఈ సినిమాలో దగ్గుపాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. అయితే తాజాగా రానా రోల్ ఫస్ట్ గ్లింప్స్ ఓ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రానా పంచె ధరించి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి మాస్ ఆడియన్స్ కి కేక పుట్టించారు.

అంతేకాదు నిత్యామీనన్‏కు భారీ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో అంటూ రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. తర్వాత బ్లాక్ షర్ట్ లో కారుపై నిల్చొని ‘డాని ఎంటర్‏టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1’ అంటూ రానా దద్దరిల్లిపోయేలా డైలాగ్స్ చెబుతాడు. దీంతో అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. దీనికి సంగీతం తమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‏కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లుగా టాక్. దీనిని 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‏టైన్‏మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.