మరీ పాతకాలం విలన్ల కన్నా.. మరీ క్రొత్త జనరేషన్ విలన్ల కన్నా కాస్త మధ్యకాలంలోని సినీచరిత్రలో ప్రేక్షకుల మనసు దోచుకుని అత్యధ్భుతమైన విలనిజాన్ని పండించిన నటుడెవరయ్యా అఃటే అందరినోట టక్కున వచ్చే పేరు రావు గోపాలరావు. మరి ఈ క్రొత్త జనరేషన్ లో ఆ మహానటుని వారసుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న విలన్ల లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఈమధ్యనే రావు రమేష్ ట్విట్టర్ అకౌంట్లో ఊహించని విధంగా కొన్ని సంచలన ట్వీట్స్ కనిపించాయి. ఆ ట్వీట్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితికోసం, అలాగే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్తితుల గురించి కూడా సంచలన ట్వీట్స్ వచ్చాయి. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కూడా కామెంట్స్ కనిపించాయి. అవన్నీ ఒక్కసారిగా మీడియా లో అలజడి సృష్టించాయి.
వివాదస్పదమైన అంశాలకు దూరంగా ఉండే రావు రమేష్ ఏంటి ఇలా ట్వీట్ చేశాడు అనుకున్నారు.. అయితే దీనిపై రావు రమేష్ వెంటనే స్పందించి తన వివరణ అందిస్తూ… తాను ఏ సోషల్ మీడియాలోనూ లేనని.. తన పేరును వాడుకుని ఎవరో ఇవన్నీ చేస్తున్నారని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తన పేరు నాశనం చేయడానికే ఎవరో చేస్తున్న కుట్ర అని కోపంతో రగిలిపోతున్నాడు రావు రమేష్. సినీరంగంపై విషప్రభావం చూపపించేలా ఇలాంటి నకిలీ ఖాతాలను సృష్టించి తప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పాడు రావు రమేష్. ఈ సందర్భంగా షోషల్ మీడియా లో ట్వీట్స్ తాను చేసినవి కావని.. వాటిని ఎవరూ నమ్మవద్దని అధికారికంగా ప్రకటన విడుదల చేసాడు రావు రమేష్. త్వరలోనే వాళ్లను పట్టుకుని వాళ్ళ అంతు చూస్తానంటూ శపధం కూడా చేశాడు రావు రమేష్.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…