Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక పుష్ప సినిమాతో ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇలా నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంటున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయటమే కాకుండా తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా తాజాగా ఈ అమ్మడు సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో మరో మైలు రాయిని చేరుకుంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగిన రష్మిక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా సరికొత్త రికార్డు సొంతం చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత తమన్నా కాజల్ అగర్వాల్ వంటి వారిని దాటుకొని అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇంస్టాగ్రామ్ లో సమంతకి 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. కాజల్ అగర్వాల్ కి 25.4 మిలియన్ ఫాలోవర్స్, అలాగే తమన్నా కి 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక 38 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న రష్మిక మొదటి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాతో పాటు మరొక ప్రాజెక్టులో నటిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…