Rashmika: నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నిత్యం వరుస సినిమా షూటింగ్ లతో ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్న ఈమె ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్గా రష్మిక ఛాన్స్ అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మధ్య సక్సెస్ అందుకున్న ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా అభిమానులు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోని ఈమె ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
పుష్ప 2 సినిమా కోసం భారీ స్థాయిలో మేకర్స్ బడ్జెట్ కేటాయించారు. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ సుమారు 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించడానికి రష్మిక కూడా ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. నయనతార త్రిష వంటి వారు మాత్రమే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే రష్మిక కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. మరి పుష్ప 2 ద్వారా శ్రీవల్లి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…