Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అదృశ్యం కావడం పట్ల స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్సింగ్ అయిన మహిళల గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది మిస్సింగ్ అయిన వారి ఆచూకిని కనిపెట్టి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారని తెలిపారు.
హోంశాఖ నేతృత్వంలో పోలీసులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై ప్రశంశల వర్షం కురిపించారు. ఈ తరుణంలోనే గత ప్రభుత్వంపై కూడా ఈయన విమర్శలు చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. గత ప్రభుత్వ హయామంలో సుమారు 30 వేల మంది మహిళలు అదృశ్యమైన ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అంటూ మరోసారి పవన్ ఆ 30 వేల మంది యువతుల గురించి ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని తద్వారా 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు అంటూ ఆరోపణలు చేయడంతో ఈ ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది గతంలో మిస్సింగ్ అయిన 30వేల మందిని వెనక్కి తీసుకురావాలి అంటూ పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేశారు.
ఇలా అప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేశారని స్పష్టమైనప్పటికీ మరోసారి పవన్ కళ్యాణ్ ఆ 30 వేల మంది గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నారు మరి తప్పిపోయిన ఆ 30 వేల మందిని వెనక్కి తీసుకురావచ్చు కదా అంటూ ప్రశ్నించడమే కాకుండా ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఎక్కడ ?రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల సంగతి ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ పై వరుస ప్రశ్నలు వేస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…