టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మీక మందన్న.. తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది..ఇక ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి మెప్పించిన రష్మీక.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటుంది..ఇక తాజగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది రష్మీక..
ఇక ఇటీవలే ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మిక నోట నుండి మొత్తానికి పెళ్లి వార్త వినిపించింది.ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సుల్తాన్ సినిమాతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఈ కన్నడ బ్యూటీ.. తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో తాజాగా కొన్ని విషయాలు పంచుకుంది రష్మిక మందన.తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా అనిపించిందని తెలిపింది.అవి తనను ఎంతగానో ఆకర్షించాయని, అక్కడ భోజనం, వంటలు చాలా రుచి గా ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ. తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాల్లో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది…సో మొత్తానికి రష్మీక మాత్రం ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలిగానీ వెళ్లాలనుకుంటోందన్నమాట..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…