Devarakonda Brothers-Rashimka: తెలుగు సీని పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె పేరు ప్రస్తుతం క్రష్మికగా మారిపోయింది. నేషనల్ క్రష్ అని ఆమెను కొంతమంది పిలుస్తారు. అలా ఆమె పేరును క్రష్మికగా సంభోదిస్తున్నారు.
అయితే గత కొంత కాలం నుంచి రష్మికకు , విజయ్ దేవరకొండకు మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిపై వాళ్లు ఇంత వరకు ఎలాంటి క్లారటీ ఇవ్వలేదు. గీతాగోవింతం సినిమా నుంచి వీళ్లిద్దరు ఎక్కువగా జంటగా తిరుగుతుండటం.. కెమెరాలకు చిక్కడం జరగుతోంది. డిన్నర్లు, డేట్స్ అంటూ.. ఇలా కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక తాజాగా.. విజయదేవరకొండ సోదరులతో క్రష్మిక సందడి చేస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికానే ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రత్యేక స్టిల్ ఇచ్చింది. ఆమె వెనుకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను పరిశీలిస్తే.. ఆనంద్ దేవరకొండ ఫోటోతో మ్యాచ్ అయ్యింది.
దీంతో న్యూ ఇయర్ వేడుకలను ఆమె విజయ్ దేవరకొండ బ్రదర్స్తో జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. గతంలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్యలో స్పెషల్ కెమిస్ట్రీ నడుస్తోందని రకరకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ వద్ద ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ప్రస్తావించగా.. తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా వాళ్లంతా కలిసే న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మరో సారి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ ఈ సారి ఎలా స్పందిస్తాడో చూడాలి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…