Ravi Krishna – Navya Swamy: బుల్లితెర ప్రసారమౌతున్న డాన్సింగ్ షో ఢీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు 13 సీట్లను ఎంతో అద్భుతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం డాన్సింగ్ ఐకాన్ పేరుతో 14వ సీజన్ ప్రసారమవుతుంది. ఇదివరకు ఈ కార్యక్రమంలో సుధీర్ రష్మి జంట ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ప్రస్తుతం సీజన్ 14 లో సుధీర్ రష్మి బదులు ఇతర కొత్త బుల్లితెర నటి నటులు ఎంట్రీ ఇచ్చారు.బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీరియల్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి కృష్ణ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రవి కృష్ణ తనకు అవకాశం దొరికినప్పుడల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి నందిత శ్వేతలతో కలిసి పులిహోర కలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి ఎపిసోడ్ లో భాగంగా రవి కృష్ణ బుల్లితెర నటి నవ్య స్వామితో కలిసి రచ్చ చేశారని తెలుస్తోంది.
వీరిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేయడంతో వీరి మధ్య రొమాన్స్ శృతిమించి పోయిందని చెప్పవచ్చు. ఇలా వీరిద్దరూ కలిసి చేసిన పర్ఫామెన్స్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి పర్ఫామెన్స్ చూస్తుంటే ఈ కార్యక్రమంలో కూడా కంటెంట్ పూర్తిగా పక్కన పెట్టి మసాలా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవ్య స్వామి రవి కృష్ణ పర్ఫామెన్స్ ప్రస్తుత వైరల్ గా మారింది. ఇక వీరిద్దరూ కలిసి సీరియల్ లో నటించడం వల్ల నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు పెద్దఎత్తున వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఈ విధమైనటువంటి రొమాంటిక్ సాంగ్ చేయడం వల్ల ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…