General News

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు శుభవార్త..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఈ విధంగా కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల పట్లఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా విజృంభిస్తున్న సమయంలో వందలాది మంది పిల్లలు తమ కుటుంబ పెద్ద దిక్కులు కోల్పోవటంతో వారి జీవనాధారం కోసం రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దుర్భర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు వారి పేరిట ఏకంగా పది లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది.

ఈ విధంగా చిన్నారుల పేరిట డిపాజిట్ చేసిన పది లక్షల రూపాయలకు నెలనెలా వచ్చే వడ్డీ ఆ పిల్లలకు కనీస అవసరాలను తీర్చేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆ పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తర్వాత వారి పేరిట డిపాజిట్ చేసిన పది లక్షల రూపాయలు డ్రా చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

49 minutes ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

1 hour ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

3 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

3 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

4 hours ago