రెజీనా కాసాండ్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే.. ఎప్పుడో సుధీర్ బాబు సరసన “శివ మనసులో శృతి” అనే సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ భామ ఆతరువాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెప్పుకోవడానికి భారీ హిట్లు లేకపోయినా తరువాత యుంగ్ హీరో సందీప్ కిషన్ సరసన వచ్చిన “రొటీన్ లవ్ స్టోరీ” సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆతరువాత వచ్చిన “పిల్లా నువ్వులేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సెల్” సినిమాలలో సాయి ధరమ్ తేజ్ సరసన కథానాయికగా తళుక్కున మెరిసింది.
ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే అడపా దడపా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. తాజగా విడుదలై విజయం సాధించిన “ఎవరు” సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో ఒక పాటలో నర్తిస్తోంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఈ ఐటెం సాంగ్ హైలైట్ అట. ఇందులో రెజీనా డాన్స్ ఇరగదీసిందాని టాక్. అయితే ఇలాంటి ఐటెం సాంగ్స్ లో మునుపెన్నడూ రెజీనా నటించలేదు, ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా రెజీనా మీడియాతో మాట్లాడుతూ తనకు డాన్స్ అంటే చాలా ఇస్తామని… చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోలేకే ఈ సాంగ్ లో చేయడానికి ఒప్పుకున్నానని, అది చిరంజీవి గారు అడిగారు కాబట్టే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ పాట షూటింగ్ ఆరు రోజులపాటు చిత్రీకరించట. ఈ పాటలో చిరంజీవి గారు తన డాన్స్ చూసి మెచ్చుకున్నారని.. అయన నుంచి అభినందనలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపింది రెజీనా. అయితే దేనిని ఐటెం సాంగ్ అనవద్దని… దీన్ని సెలెబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది ఈ భామ. ఇక ఇలాంటి సాంగ్స్ చేయడం ఇదే చివరి సారి అని.. మరోసారి ఇలాంటి సాంగ్స్ చేయనని తెలిపింది రెజీనా..
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…