సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు తెరపైకి ఎక్కించి అద్భుత విజయాలను అందుకున్నవారు కొందరు దర్శకులైతే… అపజయాలను మూటకట్టుకున్న వారు మరికొందరు దర్శకులు. అయితే తాజాగా మరో వాస్తవిక సంఘటన ఆధారంగా సినిమా రాబోతుంది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ల ప్రేమ కదా ఆధారంగా ఒక సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని నర్రా నాగేశ్వరరావు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి “అన్నపూర్ణమ్మ గారి మనవడు” అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ చిత్రానికి యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మాణ భాద్యతలు స్వీకరించగా.. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
సీనియర్ నటి జామున, బాలాదిత్య, అర్చన మరో కీలక పాత్రాలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటుడు బాలాదిత్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ సినిమా కథను సంచలనం రేపిన ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా రాసుకున్నాడని చెప్పారు. అయితే వాస్తవిక ఘటనలను చూపిస్తూనే సినిమా టచ్ ఇచ్చినట్టు తెలిపారు బాలాదిత్య. ఇందులో అర్చన తనకు జంటగా నటిస్తుందని, తక్కువ నివిడి ఉన్న పాత్ర అయినా ఆమె పాత్ర చాలా మంచి గుర్తింపు వచ్చేలా ఉంటుందన్నారు బాలాదిత్య. అయితే ప్రణయ్ చనిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఈ ఘటనపై ఎటువంటి సినిమా రాలేదు. తెలుగు తెరపై ఇప్పటికే ఇలాంటి కధలు చాలానే వచ్చాయి. మరి ఈ కథను ఎంత మంది ఆదరిస్తారో చూడాలి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…