ప్రణయ్ కేసులో నిందితుడు మారుతీరావు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై మారుతీరావు కూతురు అమృత స్పందించింది. తన తండ్రి పశ్చాత్తాపం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని మొదట అభిప్రాయపడిన ఆమె ఇప్పుడు మాట మార్చింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయనకు, అయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మారుతిరావును శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది.
మారుతీరావు ఒత్తిడివల్ల చనిపోయాడని తాను భావించడంలేదని, అయన మరణంపై శ్రవణ్ కి ఏమాత్రం బాధలేదని అయన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. బాబాయ్ శ్రవణ్ తనపై అనుమానం రాకుండా కావాలనే వీలునామాలో తన పేరు తీయించి ఉంటారని తెలిపింది అమృత. మారుతిరావుకు చట్టపరంగా శిక్ష పడాలని అనుకున్నాను కానీ ఆత్మహత్య చేసుకోవాలని ఏనాడూ కోరుకోలేదని తెలిపింది. మారుతీరావు తనతో కంప్రమైజ్ అయ్యేందుకు తన అత్తగారి ఇంటికి ఒక వ్యక్తిని పంపారని తనకు అత్తగారు మామగారి రూపంలో మరో కుటుంబం ఉన్నందున తన తల్లే కావాలనుకుంటే మా ఇంటికి రావొచ్చని తెలిపింది. తల్లి దూరమైనా భాధ తనకు ఉందని అలాగని ఇప్పుడు ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టలేనని తెలిపింది.
మారుతీరావు అంత్యక్రియలకు వెళ్ళినపుడు స్మశానంలో తనను అడ్డుకున్నారని, తన తల్లిని ఓదార్చేందుకు తాను అక్కడకు వెళ్లానని తెలిపింది అమృత. ఆస్తి గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పిన అమృత కానీ మారుతీరావు, అయన భార్య అందరు శ్రవణ్ కంట్రోల్ లోనే ఉంటారని చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…