ప్రణయ్ కేసులో నిందితుడు మారుతీరావు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై మారుతీరావు కూతురు అమృత స్పందించింది. తన తండ్రి పశ్చాత్తాపం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని మొదట అభిప్రాయపడిన ఆమె ఇప్పుడు మాట మార్చింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయనకు, అయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మారుతిరావును శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది.
మారుతీరావు ఒత్తిడివల్ల చనిపోయాడని తాను భావించడంలేదని, అయన మరణంపై శ్రవణ్ కి ఏమాత్రం బాధలేదని అయన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. బాబాయ్ శ్రవణ్ తనపై అనుమానం రాకుండా కావాలనే వీలునామాలో తన పేరు తీయించి ఉంటారని తెలిపింది అమృత. మారుతిరావుకు చట్టపరంగా శిక్ష పడాలని అనుకున్నాను కానీ ఆత్మహత్య చేసుకోవాలని ఏనాడూ కోరుకోలేదని తెలిపింది. మారుతీరావు తనతో కంప్రమైజ్ అయ్యేందుకు తన అత్తగారి ఇంటికి ఒక వ్యక్తిని పంపారని తనకు అత్తగారు మామగారి రూపంలో మరో కుటుంబం ఉన్నందున తన తల్లే కావాలనుకుంటే మా ఇంటికి రావొచ్చని తెలిపింది. తల్లి దూరమైనా భాధ తనకు ఉందని అలాగని ఇప్పుడు ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టలేనని తెలిపింది.
మారుతీరావు అంత్యక్రియలకు వెళ్ళినపుడు స్మశానంలో తనను అడ్డుకున్నారని, తన తల్లిని ఓదార్చేందుకు తాను అక్కడకు వెళ్లానని తెలిపింది అమృత. ఆస్తి గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పిన అమృత కానీ మారుతీరావు, అయన భార్య అందరు శ్రవణ్ కంట్రోల్ లోనే ఉంటారని చెప్పింది.
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…