తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తనకు ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన పిల్లలు ఆద్య, అకీరా కోసం పవన్ ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అది ఆనోటా ఈనోటా పోయి రేణు దేశాయ్ వరకు వెళ్ళింది. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు రేణు దేశాయ్.. అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారో అర్ధం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పవన్ తన పిల్లలకోసం, నాకోసం ఎలాంటి ఆస్తిని ఇవ్వలేదని.. ప్రస్తుతం తన పిల్లలతో సంతోషంగా గడుపుతున్నానని అన్నారు రేణు. నేను నా జీవిత మనుగడకోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో శ్రమిస్తున్నాను.. పోరాడుతున్నాను. నా తండ్రి దగ్గర నుంచి కూడా ఒక్కరూపాయి తీసుకోలేదు.. అలాగే నా మాజీ భర్త పవన్ దగ్గర నుంచి కూడా అన్యాయంగా ఎలాంటి ఆస్తిని పొందలేదు. హైదరాబాద్ లో నేను కొన్న ఇల్లు నా కష్టార్జితం. నా కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని నేను కొనుక్కున్న ఇల్లు.
నిన్నటి నుండి మీడియా వారి నుండి ఎన్నో మెసేజస్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఈ మ్యాటర్ సీరియస్ అయిందని అర్ధమయింది. వారు చెప్పింది విని నాకు చాలా బాధేసింది. అందుకే వివరణ ఇస్తున్నా.. అంటూ ఆవేదన చెందారు ఆమె. ఒక వార్తను రాసేటప్పుడు అది నిజమా..కాదా అని కనీసం ఆలోచన రాదా ? అని ప్రశ్నించారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకి.. ఆత్మ గౌరవానికి.. అస్తిత్వానికి… చివరికి నా ఉనికికే ప్రమాదం వస్తుందనే చిన్న ఆలోచన మీకెవరికీ రాదా? నాకు తెలిసినంత వరకు ఈ వార్త నా మాజీ భర్త పవన్ కు ఎలాంటి సంబందం ఉంది ఉండదు.. అయన వరకు ఈ వార్త వెళ్లి ఉండకపోవచ్చు.
నా జీవితాన్ని ఇప్పటి వరకు ఏ మగాడి సహాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికి, పోరాటానికీ గౌరవం ఉండకపోయినా పర్వాలేదు కానీ… ఇలాంటి వార్తలతో కించపరచకండి… నా బాధను అర్ధం చేసుకోకుండా మళ్ళీ నాకు, నా మాజీ భర్త అభిమానులకు మధ్య దయచేసి ఎటువంటి గొడవలు సృష్టించకండి. అని రేణు దేశాయ్ అన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్కు వచ్చిన…
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…
టాలీవుడ్లో మహిళా సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న వేధింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యాంకర్లు, నటీమణులు అనసూయ…
వేసవి వేడిలో చల్లని తీపి రుచిగా అందరినీ ఆకట్టుకునే ఐస్క్రీమ్ గురించి కొత్త కోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సుహాసిని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నో సూపర్…
ఇటీవలి కాలంలో ఇంటి అలంకరణలో భాగంగా మనీ ప్లాంట్ మొక్కకు ప్రత్యేక స్థానం దక్కింది. చాలా మంది ఈ మొక్కను…