Political News

Revanth Reddy: కచ్చితంగా వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి వార్నింగ్ వారికేనా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిఆర్ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరురాలిని చేయటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ హయామంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు కానీ కాంగ్రెస్ హయాంలో ఇద్దరు మహిళ మంత్రులకు చోటు దక్కిందని అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మహిళ అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది మహిళల ప్రభుత్వమని రేవంత్ వెల్లడించారు.

వరంగల్లో హైదరాబాద్ కి పోటీ నగరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసిన వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తానని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.అక్రమ సంపాదనతో కిరాయి మనుషలను తెచ్చి కుట్రలు చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy: కెసిఆర్ ఉద్యోగం..


తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మీ ఇంట్లో నలుగురు పదవులు పోయాయి తప్ప సమాజంలో ఏం కాలేదని తెలిపారు. ఒక కేసీఆర్ ఉద్యోగం పోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతోమంది రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని తెలిపారు. చిన్న చిన్న తప్పిదాలు ఉన్న వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

23 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

23 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

23 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

24 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

24 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

24 hours ago