Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిఆర్ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరురాలిని చేయటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ హయామంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు కానీ కాంగ్రెస్ హయాంలో ఇద్దరు మహిళ మంత్రులకు చోటు దక్కిందని అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మహిళ అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది మహిళల ప్రభుత్వమని రేవంత్ వెల్లడించారు.
వరంగల్లో హైదరాబాద్ కి పోటీ నగరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసిన వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తానని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.అక్రమ సంపాదనతో కిరాయి మనుషలను తెచ్చి కుట్రలు చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy: కెసిఆర్ ఉద్యోగం..
తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మీ ఇంట్లో నలుగురు పదవులు పోయాయి తప్ప సమాజంలో ఏం కాలేదని తెలిపారు. ఒక కేసీఆర్ ఉద్యోగం పోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతోమంది రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని తెలిపారు. చిన్న చిన్న తప్పిదాలు ఉన్న వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.































