Richa Pallod: విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్ రీచా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం నువ్వే కావాలి.ఈ సినిమా విడుదలై దాదాపు 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారం అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమాతో హీరోగా తరుణ్ హీరోయిన్ గా రీచా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచా అనంతరం పలు అడపాదడపా సినిమాలలో నటించారు.ఇక ఈమె చివరిసారిగా 2016వ సంవత్సరంలో ఆది పినిశెట్టితో కలిసి మలుపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈమె ఇండస్ట్రీకి దూరం అయ్యి ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏం చేస్తుందనే విషయానికి వస్తే…
రిచా 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనప్పటికీ ఈమె 2016వ సినిమాలో మలుపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.హిమాన్షు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనంతరం ఈమె పూర్తిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
భర్త వ్యాపారాలతో బిజీగా మారిన రీచా…
ఇలా రీచా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తన భర్త వ్యాపారాలలో చేదోడు వాదోడుగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న రీచా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…