RK Roja : భీమవరంలో మన్యం దొర అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అలాగే మెగాస్టార్ చిరంజీవి వంటి వారు హాజరయ్యారు. వేడుకల్లో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకల్లో ఏపీ మంత్రి ఆర్కే రోజా, మెగాస్టార్ చిరంజీవి కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఈ ఫోటోలు అటు రోజా అభిమానులను మెగాస్టార్ అభిమానులకు పాతరోజులను గుర్తుచేసాయి.
పీఎంతో, సీఎంతో, మెగాస్టార్ తో సెల్ఫీలతో రోజా సందడి….
చాలా సినిమాల్లో హిట్ పెయిర్ గా నిలిచిన మెగాస్టార్, రోజా రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులయ్యారు, విమర్శల మీద విమర్శలు చేసుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చిరు ఇప్పడు ఏ పార్టీలోని వ్యక్తి కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన ద్వారా అధికార పక్షంపై విమర్శలు చేస్తుంటారు. ఇక అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల వేడుకలో రోజా, మెగాస్టార్ చాలా హ్యాపీ గా కనిపించారు ఆప్యాయంగా పలకరించు కున్నారు.
ఇక పీఎం మోడీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుల్లో అల్లూరి ఒకరని అన్నారు. ఇక సీఎం జగన్ మాట్లాడుతూ అల్లూరి ఒక నిప్పు కణం, ఒక దేశం నుండి మరో దేశం చేస్తున్న దోపిడీపై పోరాటం చేసారని అన్నారు. ఇక ఆర్కే రోజా మెగాస్టార్ తోనే కాకుండా, పీఎం మోడీ సీఎం జగన్ తో సెల్ఫీ తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…