RK Roja: వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే .వీరు అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న కూటమి నేతలు ప్రస్తుతం వీరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా సినీనటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సైతం గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఈమెపై దళిత సంఘం నేతలు కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇక రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్కు వెళ్లారు. అప్పుడు.. ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని అప్పట్లో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.
ఇక ఈ విషయంపై అప్పట్లో ఎన్నో దళిత సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. అయితే తాజాగా ఈ విషయంపై దళిత సంఘాలు కర్నూలులో రోజా పై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసును ఫైల్ చేశారు మరి ఈ విషయంపై మంత్రి రోజా ఏవిధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది..
ఇక అప్పట్లో ఈ వివాదం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఇలా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు కేసు నమోదు కావడంతో పలువురు వైకాపా కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంపై మాజీ మంత్రి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…