Ambanti: ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి తాజాగా వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విషయం గురించి మాట్లాడారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేలు ఏ చిన్న పని చేయించాలన్నా కూడా పెద్ద ఎత్తున టాక్స్ లు కట్టించుకుంటున్నారని తెలిపారు. ఇలా కూటమి నేతలందరూ కూడా అక్రమ సంపాదనపై కన్నేసారని తెలిపారు. ఇసుక మాఫియా నుంచి మొదలుకొని మద్యం అలాగే చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు అంటూ ఈయన పరోక్షంగా జేసీ అలాగే ఆదినారాయణ రెడ్డి వివాదం గురించి కూడా మాట్లాడారు.
ఇక కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా వెళుతున్నటువంటి రేషన్ బియ్యం గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్న తీరుపై ఈయన స్పందించారు. రెండు నెలల నుంచి నన్ను ఈ పోర్టు తనిఖీ రావడానికి అడ్డుకుంటున్నారని ఈయన మాట్లాడటంతో అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నానని భావిస్తున్నారా లేకపోతే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అనుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కు లెక్క లేనంత తిక్క ఉందని తెలిపారు. ఈయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ప్రశ్నించడం హాస్యాస్పదమై తెలిపారు.. పవన్ కళ్యాణ్ ను రెండు నెలలుగా పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన మాట్లాడిన తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు లోకేష్ ఈయనని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారేమో అంటూ ఈయన మాట్లాడారు. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక కూటమినేతల సహకారంతోనే ఈ స్కాం జరుగుతుందని ఈయన మండిపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…