Ambanti: ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి తాజాగా వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విషయం గురించి మాట్లాడారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేలు ఏ చిన్న పని చేయించాలన్నా కూడా పెద్ద ఎత్తున టాక్స్ లు కట్టించుకుంటున్నారని తెలిపారు. ఇలా కూటమి నేతలందరూ కూడా అక్రమ సంపాదనపై కన్నేసారని తెలిపారు. ఇసుక మాఫియా నుంచి మొదలుకొని మద్యం అలాగే చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు అంటూ ఈయన పరోక్షంగా జేసీ అలాగే ఆదినారాయణ రెడ్డి వివాదం గురించి కూడా మాట్లాడారు.
ఇక కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా వెళుతున్నటువంటి రేషన్ బియ్యం గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్న తీరుపై ఈయన స్పందించారు. రెండు నెలల నుంచి నన్ను ఈ పోర్టు తనిఖీ రావడానికి అడ్డుకుంటున్నారని ఈయన మాట్లాడటంతో అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నానని భావిస్తున్నారా లేకపోతే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అనుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కు లెక్క లేనంత తిక్క ఉందని తెలిపారు. ఈయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ప్రశ్నించడం హాస్యాస్పదమై తెలిపారు.. పవన్ కళ్యాణ్ ను రెండు నెలలుగా పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన మాట్లాడిన తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు లోకేష్ ఈయనని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారేమో అంటూ ఈయన మాట్లాడారు. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక కూటమినేతల సహకారంతోనే ఈ స్కాం జరుగుతుందని ఈయన మండిపడ్డారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…