General News

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి .. అందులో ఇద్దరు ఆర్టిస్టులు..?

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది..ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఆర్టీసీ డిపో సమీపంలో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి.. హెచ్సీయూ వద్ద అదుపు తప్పి ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అబ్దుల్ రహీం(25), ఎన్. మానసా(19), ఎం మానసా(23)లు అక్కడిక్కడే చనిపోయారు.

మరొకరు సాయి సిద్ధి(24) తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో కారు రెడు ముక్కలైంది. ప్రమాద సమయంలో కారు 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. చనిపోయిన ఈ ముగ్గురు అమీర్ పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్ బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఎన్. మానసా, ఎం. మానసాలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అబ్దుల్ రహీం ప్రమాదానికి గురైన కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. సాయి సిద్ధి కూడా ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సాయి సిద్ధి వద్దకు వచ్చి.. కారులో లింగంపల్లి వైపుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు పోలీసులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

7 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

37 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

55 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

1 hour ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

1 hour ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago