హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది..ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఆర్టీసీ డిపో సమీపంలో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి.. హెచ్సీయూ వద్ద అదుపు తప్పి ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అబ్దుల్ రహీం(25), ఎన్. మానసా(19), ఎం మానసా(23)లు అక్కడిక్కడే చనిపోయారు.
మరొకరు సాయి సిద్ధి(24) తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో కారు రెడు ముక్కలైంది. ప్రమాద సమయంలో కారు 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. చనిపోయిన ఈ ముగ్గురు అమీర్ పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్ బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఎన్. మానసా, ఎం. మానసాలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అబ్దుల్ రహీం ప్రమాదానికి గురైన కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. సాయి సిద్ధి కూడా ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సాయి సిద్ధి వద్దకు వచ్చి.. కారులో లింగంపల్లి వైపుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు పోలీసులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





























