Roja and YCP together accused me of having illicit relations.. - Sharmila is angry
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వైసీపీ నాయకురాలు రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో వైసీపీ నాయకులు తనపై, తన తల్లి విజయమ్మపై చేసిన నీచమైన ప్రచారాలను గుర్తు చేసుకుని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“రోజా, వైసీపీ కలిసి నాపై అక్రమ సంబంధాలు ఆపాదించారు. నా రక్త సంబంధీకులే నాపై విష ప్రచారం చేశారు. నేను వైఎస్సార్కు పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానమని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో ఒక్కసారి ఆలోచించండి” అంటూ షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.
గతంలో తన సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలియగానే, రక్త సంబంధానికి విలువనిచ్చి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల గుర్తు చేశారు. “మీరు మనుషులు కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మీ పతనానికి పునాది పడింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రావాలని కోరుకుంటున్నాను” అని వైసీపీ నాయకులను ఉద్దేశించి షర్మిల తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్ర సమస్యలపై జరిగే ప్రజా పోరాటాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడతానని ఆమె పునరుద్ఘాటించారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…