Roja: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం రెండవ సీజన్లో భాగంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం పై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ కాస్త పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణమైంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎపిసోడ్ గురించి ఇప్పటికే వైసీపీ నేతలు స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రి సినీనటి రోజా సైతం కార్యక్రమం పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి మెగా కుటుంబానికి పెద్దగా సఖ్యత లేదని విషయం మనకు తెలిసిందే. గతంలో మెగా హీరోలు బాలకృష్ణ గారి గురించి పెద్ద ఎత్తున అనుచిత వ్యాఖ్యలు చేశారు.అయితే ఇలా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒకే వేదికపై సందడి చేయడంతో రోజా స్పందిస్తూ కేవలం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కి రావడం కూడా ప్యాకేజీలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ను బద్ధ శత్రువుగా భావించే బాలకృష్ణ కార్యక్రమానికి పవన్ వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని రోజా వెల్లడించారు. గతంలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నటువంటి మెగా నందమూరి హీరోలు ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలిసారని ఈమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుకోవడం కోసమే ఈ షో కి హాజరయ్యారని ఇది కూడా ప్యాకేజీలో భాగమే అంటూ రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…