సినీ నటి రోజా అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినీ పరిశ్రమలోనూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొంది తన సత్తా ఏంటో చూపించారు. తర్వాత సినిమాలకు దూరం అయి.. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒకప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం తీవ్ర దుర్భరంగా ఉందంటూ ఓ టీవీ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చింది.
సెల్వమణితో వివాహానికి ముందు ఆమెకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారట.. కానీ పెళ్లైన సంవత్సరం లోపే ఆమెకు అన్షు పుట్టింది. అయితే రెండో సంతానంకు ఆమె ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ఆమె గర్భం దాల్చిన ఐదు నెలలకు తీవ్ర రక్త స్రావం అయిందట. దీంతో ఎంతో భయపడిపోయి వైద్యులను సంప్రదించారు రోజా.
అప్పటికే ఒక సంతానం ఉన్న ఆమెకు ఇది రెండో సంతానం. రక్త స్రావం ఎక్కవ అవుతుండటంతో ఆమెకు అబార్షన్ చేయాలని చెప్పారట వైద్యులు. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. చివరకు డాక్టర్లు ఒక పరిష్కారం చెప్పారు. ప్రస్తుతం ఐదోనెల కాబట్టి.. ఆబిడ్డ బతకాలంటే ఏడు నెలలు వస్తే సరిపోతుంది. కావునా ఇప్పటి నుంచి రెండు నెలల అంటే.. ఏడో నెల వచ్చే వరకు కాళ్లు పైకి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. బిడ్డ బతికే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారట.
దానికి రోజా ఒప్పుకొని.. దాదాపు రెండు నెలలు ఆసుపత్రిలోనే ఉంటూ ఆమె వైద్యుల సలహా మేరకు పాటించిందట. తర్వాత ఆమెకు కొడుకు(కృష్ణ లోహిత్) పుట్టడాని చెప్పుకొచ్చారు. ఇలా ఆమె రెండో సంతానం కోసం ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్లో బిజీగా…
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…