RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇలా ఇప్పటికే ఈ సినిమా ఫిలిం ఫేర్ హాలీవుడ్ క్రిటిక్స్ గోల్డెన్ గ్లోబ్ వంటి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.
ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలను అందుకున్నప్పటికీ ఈ అవార్డుల జాతరలో మాత్రం చిత్ర బృందం పాల్గొన్న ఈ సినిమా నిర్మాత దానయ్య మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలోనే నిర్మాత ఎక్కడా కనిపించకపోవడంతో ఎంతోమంది పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు ఈ సినిమా అవార్డుల జాతరలో దానయ్య కనిపించకపోవడానికి గల కారణం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండడం కోసం సినిమా ప్రమోషన్లకు అయ్యే ఖర్చును నిర్మాత దానయ్య భరించలేనని చెప్పారట.ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని అయితే ఇదంతా కూడా రాజమౌళి మాత్రమే భరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్లకు దానయ్య డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఈ సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.అయితే మరొక వార్త కూడా వైరల్ గా మారింది. దానయ్య వేదికలపై మాట్లాడటానికి కాస్త తడబడతారు. అందుకోసమే ఆయనను ఇతర దేశాలకు తీసుకువెళ్లి అక్కడ వేదిక ఇబ్బంది పెట్టడం ఎందుకు అని భావించిన రాజమౌళి ఈ సినిమా బాధ్యతను ఇప్పటికే తన భుజాలపైనే వేసుకొని అవార్డు వేడుకలలో కూడా దానయ్యకు వచ్చిన అవార్డులను అందుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా అవార్డు వేడుకలోనైనా దానయ్య పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…