Big Breaking News: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. అమెరికా రంగంలోకి..?
Big Breaking News: రష్యా దేశ సరిహద్దును ఎక్కువ మొత్తంలో పంచుకుంటున్న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. డోన్బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. గత నెల రోజుల నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఉక్రెయిన్ తో భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దశ్యంతో.. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్ కు అమెరికా మద్ధతు పలుకుతోంది.
తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆ ప్రభుత్వాన్ని గద్దే దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.
ఈ నిర్ణయంతో ప్రపంచదేశాలు షాక్ కు గురయ్యాయి. రష్యా దూకుడుపై ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. రష్యా మాత్రం అనుకున్నదే చేసుకుపోతోంది. అటు అమెరికా దేశం కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా.. ఎలాగైన రష్యా దాడులను తప్పికొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ ను ఎలాగైనా కాపాడాలనే భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని.. విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రపంచ దేశాల అధికారులు కోరుతున్నారు. ఇక దీనిపై అత్యవసరంగా ఐక్యరాజ్య సమితి జనరల్ భేటీ అయింది.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…