సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ప్రతీ రోజు వందల్లో వార్తలు.. అతడి చికిత్సకు సంబంధించి ప్రతీ న్యూస్ ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడు నడిపిన బైక్ గురించి అనేక వార్తలు వచ్చాయి. వాటితో పాటే అతడు బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగిందనే ఫేక్ వార్తలు కూడా వచ్చాయి.
ఇవన్నీ పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి చికిత్సకు సంబంధించి మరో వార్త వచ్చింది. అతడికి కీలకమైన సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలామందికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనే అనుమానాలకు కూడా వైద్యులు చెక్ పెట్టారు. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడికి అబ్జర్వేషన్ లో పెట్టామని.. 24 గంటల తర్వాత కీలక సర్జరీ చేసేదుకు ప్రయత్నిస్తున్నామని.. వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
మొదట అతడు ఆసుపత్రిలో చేరగానే 48 గంటల డేంజర్ జోన్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ శారీరం సహరిస్తే సర్జరీ చేస్తామని చెప్పిన వైద్యులు.. తాజాగా ఆ గడువు ముగిసింది. దీంతో అతడి శరీరం సహకరిస్తే సర్జరీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
కాలర్ బోన్కు ఫ్రాక్చర్ కావడంతో దానికి సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…