శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అతడి ప్రమాదానికి గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందని వార్తలు రాగా.. దానిని పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలను న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడంపై అటు అభిమానులు, ఇటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
గత రెండు రోజుల నుంచి మీడియా అంతా ఆ మెగా హీరో చుట్టే తిరుగుతోంది. అతడు బైక్ నడుపుతున్న సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో నడిపారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. కానీ అంత స్పీడ్ గా వెళ్లే రోడ్లుగానీ.. అంత అవకాశం గానీ హైదరాబాద్ లో లేవు. కానీ ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై జబర్దస్త్ హైపర్ ఆది ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేశారు.
అన్నా.. నిన్ను అలా చూస్తుంటే ఏడుపు వస్తుంది.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన బాధను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు హైపర్ ఆది. దీంతో పాటు మీడియాలో తప్పుడు కథనాలపై కూడా తన రేంజ్ లో విరుచుకుపడ్డాడు.. తప్పుడు ప్రసారం, ప్రచారాలు చేయడం వల్ల నిజాలను చెప్పినా.. మున్ముందు నమ్మే స్థితిలో ఉండరని అన్నారు.
హైదరాబాద్ రోడ్లపై సూపర్ మాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడ్తో వెళ్ళలేడు.. మీరు ఎక్కడ దొరికారురా మాకు.. మీ బతుకులు చెడ అంటూ ట్వీట్ చేశాడు హైపర్ ఆది. అతడు తెలుగు మీడియాపై తప్పుడు వార్తలు చెబుతున్నారంటూ.. ట్వీట్ చేయడంతో నెటిజన్లు కూడా అతడికి సపోర్టు పలికారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…