Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. బైక్ పై ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈయన అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. దీంతో 12 రోజులపాటు కోమాలో ఉన్నటువంటి సాయి ధరంతేజ్ కు పలు సర్జరీలు కూడా నిర్వహించి ఈయనని ప్రాణాలతో కాపాడారు.
ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని తెలుస్తుంది.సాధారణంగా ఎవరికైనా మరణం అంచులు దాకా వెళ్లి వస్తే తిరిగి ఆ పని చేయాలంటే భయపడతారు. ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బైక్ నడపాలి అంటే చాలా భయపడ్డారట.
ఇలా బైక్ అంటేనే భయం ఉన్నటువంటి ఈయనని తన తల్లి ఆ భయం నుంచి బయటకు తీసుకు వచ్చారని తెలిపారు.తను కాస్త కోలుకున్న తర్వాత స్వయంగా తన అమ్మ తనకు కీస్ ఇచ్చి బైక్ నడపమని చెప్పారని సాయి తేజ్ వెల్లడించారు. మొదట్లో తన ఇంటి పార్కింగ్ లోనే మెల్లిమెల్లిగా బైక్ నడిపే వాడినని ఆ తర్వాత కాస్త దూరం వెళ్లానని సాయి ధరంతేజ్ వెల్లడించారు.
ఇప్పుడు తాను మామూలుగానే బైక్ నడుపుతున్నానని ఈయన తెలియచేశారు. అయితే ప్రమాదానికి గురైన ఆ బైక్ ఏం చేశారన్న ప్రశ్న కూడా తనకు ఎదురు కావడంతో ఆ బైక్ తనకు తన తాతయ్య కొనిచ్చారని అయితే ప్రమాదం జరిగిన తర్వాత అది పూర్తిగా పాడవడంతో మరొక బైక్ కొనుగోలు చేసి దానిని అమ్మేశాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…