Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. బైక్ పై ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈయన అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. దీంతో 12 రోజులపాటు కోమాలో ఉన్నటువంటి సాయి ధరంతేజ్ కు పలు సర్జరీలు కూడా నిర్వహించి ఈయనని ప్రాణాలతో కాపాడారు.
ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని తెలుస్తుంది.సాధారణంగా ఎవరికైనా మరణం అంచులు దాకా వెళ్లి వస్తే తిరిగి ఆ పని చేయాలంటే భయపడతారు. ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బైక్ నడపాలి అంటే చాలా భయపడ్డారట.
ఇలా బైక్ అంటేనే భయం ఉన్నటువంటి ఈయనని తన తల్లి ఆ భయం నుంచి బయటకు తీసుకు వచ్చారని తెలిపారు.తను కాస్త కోలుకున్న తర్వాత స్వయంగా తన అమ్మ తనకు కీస్ ఇచ్చి బైక్ నడపమని చెప్పారని సాయి తేజ్ వెల్లడించారు. మొదట్లో తన ఇంటి పార్కింగ్ లోనే మెల్లిమెల్లిగా బైక్ నడిపే వాడినని ఆ తర్వాత కాస్త దూరం వెళ్లానని సాయి ధరంతేజ్ వెల్లడించారు.
ఇప్పుడు తాను మామూలుగానే బైక్ నడుపుతున్నానని ఈయన తెలియచేశారు. అయితే ప్రమాదానికి గురైన ఆ బైక్ ఏం చేశారన్న ప్రశ్న కూడా తనకు ఎదురు కావడంతో ఆ బైక్ తనకు తన తాతయ్య కొనిచ్చారని అయితే ప్రమాదం జరిగిన తర్వాత అది పూర్తిగా పాడవడంతో మరొక బైక్ కొనుగోలు చేసి దానిని అమ్మేశాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…