Tamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నకు మెగా కోడలు ఉపాసన ఒక డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.తమన్నా నటనకు ఫిదా అయినటువంటి ఉపాసన తనకు ఎంతో విలువైనటువంటి డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇక ఈ డైమండ్ రింగ్ ప్రపంచంలోనే ఐదవ పెద్ద డైమండ్ అని కూడా తెలిపారు అంతేకాకుండా ఈ డైమండ్ విలువ రెండు కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఈ విధంగా తమన్న కోసం ఉపాసన ఇచ్చినటువంటి రింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు చివరికి తమన్న వరకు చేరడంతో ఈ వార్తలపై తమన్న స్పందించి అసలు విషయం తెలియజేశారు.ఉపాసన తనకు డైమండ్ రింగ్ ఇచ్చారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తనకు ఎటువంటి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వలేదని తమన్నా వెల్లడించారు.
ఇకపోతే తన చేతికి డైమండ్ రింగ్ ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి నిజానికి అది డైమండ్ రింగ్ కాదని ఈమె తెలియజేశారు. చేతి వేలికి సోడా బాటిల్ ఓపెనర్ పెట్టుకోవడంతో చాలా బాగా అనిపించింది. అందుకే ఆ ఓపెనర్ తో కొన్ని ఫోటోలు దిగానని ఈ సందర్భంగా తమన్నా వెల్లడించారు. ఇలా తన చేతికి ఉన్నది డైమండ్ రింగ్ కాదు సోడా బాటిల్ ఓపెనర్ అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా తనకు మెగా కోడలు ఉపాసన డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించి తమన్న క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తల పట్ల తమన్నా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పడిందని తెలుస్తుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జైలర్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…