Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం బ్రో. ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తాను త్రివిక్రమ్ ఇంట్లో ఉన్నానని తెలిపారు. అప్పుడే తేజ్ ప్రమాదానికి గురయ్యారని ఫోన్ వచ్చింది వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లాను.
హాస్పిటల్ కి వెళ్తున్న సమయంలో పెద్దగా ప్రమాదం జరిగి ఉండదు తాను ఒక గంటలో బయటకు వస్తారు అనుకుంటూ అక్కడికి వెళ్లాను అయితే అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా లోపలికి వెళ్తున్నారు ఏం జరిగిందో చెప్పడం లేదు. కండిషన్ మాత్రం సీరియస్ అని చెప్పారు.దాంతో తనలో తానే చాలా కుమిలిపోయి ఏడ్చానని తెలిపారు. ఇలా తాను ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఒక మూలన కూర్చుని నేను ఆరాధించే దేవతను ప్రార్థించాను.
వాడిని ఎలాగైనా బ్రతికించు వాడికి చాలా జీవితం ఉందని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. ఇక తాను క్షేమంగా బయటపడినందుకు ముందుగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాలి అంతకంటే ముందుగా రోడ్డుపై నిస్సహాయంగా పడి ఉన్నటువంటి తేజ్ ను కాపాడిన అబ్దుల్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటాను. అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…