Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కీలకపాత్రలో నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ అభిమానులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ చెప్పినటువంటి సమాధానం అందరికీ కాస్త నవ్వు తెప్పిస్తుంది. ఇంకెక్కడి పెళ్లి బ్రో ఈ సినిమా టైటిల్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరిని ట్రై చేసుకోవచ్చు అనుకున్నాను అయితే ఈ సినిమా టైటిల్ విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు తనని బ్రో అని పిలవడం మొదలుపెట్టారు అంటూ సమాధానం చెప్పారు.
ఈ విధంగా ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత అందరూ తనని బ్రోగానే భావిస్తున్నారు అంటూ పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే విరూపాక్ష వంటి సక్సెస్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి బ్రో చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…