Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కీలకపాత్రలో నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ అభిమానులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ చెప్పినటువంటి సమాధానం అందరికీ కాస్త నవ్వు తెప్పిస్తుంది. ఇంకెక్కడి పెళ్లి బ్రో ఈ సినిమా టైటిల్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరిని ట్రై చేసుకోవచ్చు అనుకున్నాను అయితే ఈ సినిమా టైటిల్ విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు తనని బ్రో అని పిలవడం మొదలుపెట్టారు అంటూ సమాధానం చెప్పారు.
ఈ విధంగా ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత అందరూ తనని బ్రోగానే భావిస్తున్నారు అంటూ పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే విరూపాక్ష వంటి సక్సెస్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి బ్రో చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…