Sai Pallavi : దక్షిణాదిన కేవలం నటనతో మాత్రమే గుర్తింపు తెచ్చుకుని అందరు హీరోయిన్లకు భిన్నంగా దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. నటనా ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ అందరినీ మెప్పిస్తోన్న ఈ చిన్నది ఇటీవలే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో అలరించింది. ఇక ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వం సినిమా చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇపుడు ఓటీటీ లో విడుదలకు సిద్ధమైంది.
ఐటమ్ సాంగ్స్ నావల్ల కాదు…..
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముచ్చటించిన సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. డాన్స్ ఇరగదిసే సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ చేస్తారా అన్న ప్రశ్నకు నో అని చెప్పేసింది. నాకు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇష్టం లేదని, ఐటమ్ సాంగ్స్ సినిమాల్లో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టుకుంటారు అంటూ చెప్పింది. దుస్తుల విషయంలో కూడా తాను కంఫర్ట్ లేకపోతే అలాంటి బట్టలు వేయలేనని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ చేయాలనే ఆలోచన తనకు రాలేదని పల్లవి చెప్పింది.
ప్రేమ, కెరీర్ గురించి….
ఇక సాయి పల్లవి ప్రేమ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడింది. కెరీర్ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా జీవితంలో అంతే ముఖ్యమని చెప్పింది. జీవితంలో ఏదో ఒకటి లేకపోయినా వెలితిగా ఉంటుందని, కెరీర్, ప్రేమ రెండూ ఉన్నపుడే జీవితం పరిపూర్ణం అవుతుందని చెప్పింది. సాయి పల్లవి ఒక సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది. అయితే తెలుగులో ఇంతవరకు ఏ టాప్ హీరో సరసన సినిమా చేయలేదు పల్లవి. ఇపుడు ఎన్టీఆర్, కొరటాల సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ అంటూ వార్తలోచ్చినా ఇంక పక్కా ఇన్ఫర్మేషన్ లేదు చూడాలి మరీ ఏ టాప్ హీరో సాయి పల్లవికి ఆఫర్ ఇస్తాడో.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తి ఉత్సాహం మరోసారి స్పష్టంగా కనిపించింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ…
మన రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. పళ్ళపై ఉండే తెల్లటి రక్షణ…
మన వంటింట్లో సాధారణంగా కనిపించే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతున్నాయి. పరిమాణంలో చిన్నగా…
నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…
దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…
మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…