తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.
ఆమెకు ఉన్న ఆ క్రేజ్ తోనే భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. సాయి పల్లవి డాన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈమె సినిమాల్లో నటించే ముందు ఈమెకు కథ నచ్చితేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవలే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాను కూడా వద్దని చెప్పింది.
ఇది ఇలా ఉంటే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ అక్క చెల్లెలు ఇద్దరు చూడటానికి ఒకేలా కనిపిస్తుంటారు. అయితే గతంలోనే పూజ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా అధికారికంగా ప్రకటన రావడంతో ఇది కాస్త కన్ఫామ్ అయ్యింది. తమిళ ఇండస్ట్రీ లోకి పూజా కన్నున్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ దర్శకుడి దర్శకత్వంలో చిత్తరాయి సెవ్వనం అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సముద్రకని, పూజా కన్నన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో వీరు తండ్రి కూతురుగా నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 3న జీ5 లో విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…