Saidharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకున్నటువంటి సాయి ధరంతేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ హీరో సాయిధరమ్ తేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఎంతో చలాకీగా ఉండేవారు.
ఇక ఈయన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి ఈయనని తిరిగి షూటింగ్ లొకేషన్లో చూసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.ఎంతో అద్భుతమైన నటనను కనబరిస్తూ, ఎంతో అవలీలగా డాన్స్ చేసే సాయి తేజ్ ప్రమాదం తర్వాత నటించడానికి, డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ క్షణం తనని చూసి కన్నీళ్లు ఆగలేదని ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడి ఈయన కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ లొకేషన్లోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది.నిజంగానే ఇది ఈయనకు పునర్జన్మ అంటూ సాయి తేజ్ గురించి సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా రాబోతున్న ఈ హీరోకి ఎలాంటి సక్సెస్ అందుతుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…