Saidharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకున్నటువంటి సాయి ధరంతేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ హీరో సాయిధరమ్ తేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఎంతో చలాకీగా ఉండేవారు.
ఇక ఈయన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి ఈయనని తిరిగి షూటింగ్ లొకేషన్లో చూసినప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.ఎంతో అద్భుతమైన నటనను కనబరిస్తూ, ఎంతో అవలీలగా డాన్స్ చేసే సాయి తేజ్ ప్రమాదం తర్వాత నటించడానికి, డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ క్షణం తనని చూసి కన్నీళ్లు ఆగలేదని ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడి ఈయన కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ లొకేషన్లోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది.నిజంగానే ఇది ఈయనకు పునర్జన్మ అంటూ సాయి తేజ్ గురించి సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా రాబోతున్న ఈ హీరోకి ఎలాంటి సక్సెస్ అందుతుందో తెలియాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…