Saiyami Kher: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల జీవితం చాలా లగ్జరీగా ఉంటుందని భావిస్తాము. అయితే వాళ్లు అనుభవించే ఆ లగ్జరీ జీవితం వెనక ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఉంటాయని విషయం వాళ్ళు చెబితే తప్ప మనకు తెలియదు. ఎంతోమంది కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇలా జరిగినటువంటి చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు మరాఠీ ముద్దుగుమ్మ సయామీ ఖేర్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఈ సినిమా అనంతరం తిరిగి మరాఠి హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా నాగార్జున నటించిన ది వైల్డ్ డాగ్, ఆనంద్ దేవరకొండ హైవే సినిమాల ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇకపోతే తాజాగా ఈమె నటించిన ‘ఫాదూ’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో తాను తన బాడీ షేప్ గురించి ఎదుర్కొన్నటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరియర్ మొదట్లో తనని చాలామంది లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలంటూ వెటకారంగా మాట్లాడారని ఈమె బాధపడ్డారు.
ఇలా ఒక వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చాలామంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి వారి పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఈమె ఆవేదన చెందారు.ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నోటికొచ్చినట్లు చీప్ కామెంట్స్ చేయకూడదు అంటూ ఈ సందర్భంగా సయామీ కేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…