Samantha : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినాకూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ వచ్చింది. అయితే ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్నా ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంతా బాగుందనుకునే లోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే సమంత తాజాగా యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సుమ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం ఇదంతా బాగా వైరల్ అయింది. ఇక ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత ఆరోగ్యం పై రోజుకో కథనం మీడియాలో ప్రత్యక్షం అవుతోంది. దీంతో ఆమె సన్నిహితులు అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సౌత్ కొరియా వెళ్లిన సమంత…
సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇక చికిత్స కోసం ఇప్పటికే అమెరికా వెళ్లొచ్చిన సమంత అక్కడ పూర్తిగా నయం కాదని తెలిసీ ఇండియా తిరిగి వచ్చేసింది. ఇక సన్నిహితుల సూచణ మేరకు కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు తాజాగా సమంత చికిత్స కోసం సౌత్ కొరియా వెళ్లిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి సమంత మేనేజర్ స్పందించారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు వార్తలు రాస్తున్నారు.
సమంత ఎక్కడికీ వెళ్ళలేదు తన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటోంది. తాను ఏ చికిత్స తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో సమంత ఆరోగ్యం గురించి తమిళ మీడియా అనేక కథనాలను ప్రచురించడంతో అభిమానులు, ఆమె సన్నిహితులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో సమంత కు చెందిన పర్సనల్ మేనేజర్ ఒక ప్రకటనలో ఆమె ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…