Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూనే తాను కమిట్ అయిన సినిమాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఇక ఈమె ఈ వ్యాధి బారిన పడినప్పటి నుంచి పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.
ఇలా కమిట్ అయిన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి మయో సైటిసిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటంతో సోషల్ మీడియాలో కూడా కాస్త యాక్టివ్ అయ్యారు.ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తరచూ కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత తాజాగా సద్గురు చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కొటేషన్ షేర్ చేశారు. ఇందులో మీ జీవితంలో ఉపయోగపడని వాటన్నింటిని వదిలిపెట్టండి. మీ ఇంటిలోనూ మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను వదిలిపెట్టి ఈ రోజును కొత్తగా ప్రారంభించండి అంటూ సద్గురు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన కొటేషన్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సమంత ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన పరిస్థితిని తలుచుకొని వేదికపైనే ఎమోషనల్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…