Shruthi Hassan: సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఈమె రీఎంట్రి తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె నటించిన వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.
ఇకపోతే శృతిహాసన్ ఇది వరకు మెగా కాంపౌండ్ లో పలువురు హీరోలతో కలిసి నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విషయాన్ని అందుకోవడంతో కొందరు శృతిహాసన్ మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇది వరకే పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ కాటమరాయుడు సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతిహాసన్ సందడి చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇక ఈమె అల్లు అర్జున్ సరసన రేసుగుర్రం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అలాగే రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.
ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ భారీ కలెక్షన్లను రాబడుతుంది.ఇలా మెగా హీరోలు అందరితో కలిసి శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈమె మెగా హీరోలకు హీరోయిన్ గా మారిపోయింది. శృతిహాసన్ కు ఇక పై మెగా హీరోలు మరికొన్ని సినిమాలలో అవకాశం కల్పించే సూచనలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…