Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూనే తాను కమిట్ అయిన సినిమాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఇక ఈమె ఈ వ్యాధి బారిన పడినప్పటి నుంచి పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.

ఇలా కమిట్ అయిన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి మయో సైటిసిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటంతో సోషల్ మీడియాలో కూడా కాస్త యాక్టివ్ అయ్యారు.ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తరచూ కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత తాజాగా సద్గురు చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కొటేషన్ షేర్ చేశారు. ఇందులో మీ జీవితంలో ఉపయోగపడని వాటన్నింటిని వదిలిపెట్టండి. మీ ఇంటిలోనూ మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను వదిలిపెట్టి ఈ రోజును కొత్తగా ప్రారంభించండి అంటూ సద్గురు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన కొటేషన్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha: చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన సమంత…
ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సమంత ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన పరిస్థితిని తలుచుకొని వేదికపైనే ఎమోషనల్ అయ్యారు.




























