Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత ఒంటరిగా జీవిస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ విధంగా సమంత తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సమంతా త్వరగా తిరిగి కోల్పోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తనకు ధైర్యం చెబుతున్నారు.ఇక అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ సుశాంత్ వంటి వారు కూడా సమంత త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు.
సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతుందని తెలిసినప్పటి నుంచి అందరి ఫోకస్ నాగచైతన్య పై పడింది. నాగచైతన్య సమంతను వెళ్లి పరామర్శిస్తారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా సమంతను పరామర్శించకపోయిన నేరుగా తనని కలిసి తనని పరామర్శించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తలు ప్రకారం అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరు కూడా సమంతను కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.విడాకుల ప్రకటన చేసిన తరుణంలో తామిద్దరం ఇకపై మంచి స్నేహితులుగా కొనసాగుతామని చెప్పినప్పటికీ వీరి మధ్య కనీసం స్నేహబంధం కూడా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య వెళ్లి సమంతను పరామర్శిస్తారనేది పూర్తిగా అబద్ధమని ఇది జరిగే పని కాదంటూ మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి నిజంగానే నాగచైతన్య సమంతను పరామర్శిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…