అక్కినేని సమంత ఓ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమంత టాక్ షో”సామ్ జామ్”ప్రోమో వీడియో బయటకు వచ్చింది. ఈ టాక్ షో ద్వారా పలు సెలబ్రిటీస్ ల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడమే ఈ టాక్ షో ప్రత్యేకత. అయితే ఈ టాక్ షోలో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చారు. విడుదలైన ప్రోమో ప్రకారం ప్రస్తుతం విజయ్ దేవరకొండ సింగిలేనని ఆడియన్స్ కి చెబుతాడు.
ఈ షో కోసం సమంత ఇప్పటికే సిని సెలబ్రెటీలతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఈరోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్లో విడుదలైనప్పటి నుంచి ఈ టాక్ షో కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోమో వీడియోను సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
ఈ టాక్ షో ప్రోమో ప్రకారం చిరంజీవి,అల్లు అర్జున్, తమన్నా,రష్మిక వంటి సినీస్టార్ల తోపాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్,కశ్యప్ మొదలైన వారు కూడా ఈ టాక్ షోలో గెస్ట్ గా కనిపించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఫస్ట్ ఎపిసోడ్ ను శుక్రవారం స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండకు సమంత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో,వాటికి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దసరా స్పెషల్ ఎపిసోడ్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ కి సమంత హోస్ట్ గా నిర్వహించారు. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం నాగార్జున షూటింగ్ కి వెళ్లగా అతని స్థానంలో సమంత హోస్ట్ గా నిర్వహించిన విషయం తెలిసినదే. ఈ రోజు విడుదల కానున్న సమంత టాక్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…