Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధి కారణంగా ఈమె నటించాల్సిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.ఇలా అనారోగ్యంతో బాధపడుతూనే ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరోవైపు ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
ఇక తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ క్రమంలోనే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గుణ శేఖర్ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక్కడు సినిమాని ఇప్పటికి ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.
ఇక ఈ సినిమాకి ముగ్గురు హీరోలు కథకు కథానాయకుడు దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత.ఇక ఈ సినిమాని తెర వెనుక ఉండి నడిపిస్తున్న దిల్ రాజు గారు కూడా ఈ సినిమాకి హీరో అంటూ ఈయన శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక గుణశేఖర్ వేదికపై ఎమోషనల్ అవడంతో అక్కడే ఉన్నటువంటి సమంత కూడా ఎమోషనల్ అవుతూ ఏకధాటిగా కన్నీళ్లను కార్చింది. ఇలా తన పరిస్థితిని తలుచుకొని సమంత ఏకధాటిగా ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. అయితే అభిమానుల అరుపులకు ఈమె తేరుకొని అనంతరం నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…