Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధి కారణంగా ఈమె నటించాల్సిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి.ఇలా అనారోగ్యంతో బాధపడుతూనే ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరోవైపు ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
ఇక తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ క్రమంలోనే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గుణ శేఖర్ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక్కడు సినిమాని ఇప్పటికి ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.
ఇక ఈ సినిమాకి ముగ్గురు హీరోలు కథకు కథానాయకుడు దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత.ఇక ఈ సినిమాని తెర వెనుక ఉండి నడిపిస్తున్న దిల్ రాజు గారు కూడా ఈ సినిమాకి హీరో అంటూ ఈయన శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక గుణశేఖర్ వేదికపై ఎమోషనల్ అవడంతో అక్కడే ఉన్నటువంటి సమంత కూడా ఎమోషనల్ అవుతూ ఏకధాటిగా కన్నీళ్లను కార్చింది. ఇలా తన పరిస్థితిని తలుచుకొని సమంత ఏకధాటిగా ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. అయితే అభిమానుల అరుపులకు ఈమె తేరుకొని అనంతరం నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సమంతకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…