Samantha: సమంత తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ టాక్ షోలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పెళ్లి తర్వాత తన జీవితం విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు గురించి ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సమంతకు నెపోటిజం గురించి కూడా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో వారసత్వం గురించి ఈమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత నెపోటిజం గురించి మాట్లాడుతూ ఆపిల్స్ రెండు ఒకేలా ఉండవని అలాగే ఇండస్ట్రీలో నేపో పిల్లలు..నాన్ నెపో పిల్లలు ఒకేలా ఉండరని ఈమె వెల్లడించారు. వారసత్వం నుంచి వచ్చినవారు హీరోలు అవుతుంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు స్టార్ హీరోలు అవుతున్నారని ఈమె పరోక్ష వెల్లడించారు.
ఇకపోతే నేపో పిల్లలు..నాన్ నెపో పిల్లలలో కూడా టాలెంట్ ఉంటుందని అయితే ఒక తండ్రి కోచ్ అయినప్పుడు తన పిల్లలను పక్కనుండి మాత్రమే ఆడించగలడు కానీ ఆ గేమ్లో గెలవడానికి ఆ తండ్రి ఏమాత్రం సహాయ పడడు. పూర్తిగా గెలవాలన్నది అతనిపై ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా సమంత నెపోటిజం గురించి పరోక్షంగా చైతన్యను ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారని తెలుస్తోంది.
వారసత్వం నుంచి వచ్చిన పిల్లలైనా తన తండ్రి ప్రమేయం రెండు మూడు సినిమాలు వరకే ఉంటుందని అనంతరం వారి టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.ఇక తన విషయానికొస్తే తాను సినిమాలో ఫెయిల్ అయితే కేవలం తన తల్లి తండ్రి సోదరుల వరకు మాత్రమే తెలుస్తుంది అయితే ఒక వారసత్వం నుంచి వచ్చిన వాళ్లు ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే వారి గురించి వారి తండ్రి తాతల గురించి దేశవ్యాప్తంగా తెలుసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది అంటూ సమంత ఈ సందర్భంగా వారసత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…