Sathya Master : రాకేష్ మాస్టర్ మరణం తరువాత ఆయన గొప్పతనం, ఆయన ఎలా ఎదిగాడు, ఇండస్ట్రీకి ఆయన చేసిన కృషి వంటి విషయాల గురించి సోషల్ మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. ఇక ఆయన మరణం గురించి కూడా అనేక అనుమానాలు వస్తున్న తరుణంలో రాకేష్ మాస్టర్ శిష్యుడైన సత్య మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన మరణానికి గల కారణాలు వివరించారు.
ఆయన ఒంటి మీద గాయాలు… గాంధీ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లారో…
సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ కలిసి రాకేష్ మాస్టర్ మరణించాక పెద్ద కర్మ కార్యక్రమంను నిర్వహించారు. సత్య మాస్టర్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ గొప్పతనం వివరించారు. అలాగే అయన అంత్యక్రియలు అయ్యాక ఒంటి మీద గాయాలున్నాయని చెప్పారు. ఆయన చనిపోయారనే బాధలో ఉండి నేను గమనించలేదు, మాకు కేవలం రక్త వాంతులు, విరేచనాలు అయి మరణించారని చెప్పారు.
ఇక ఆయనను గాంధీ హాస్పటల్ ఎందుకు తెసుకెళ్ళారన్నది అర్థం కానీ ప్రశ్న. ఆయన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కానీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించకుండా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారో తెలియదు. ఆశ్రమం స్వామీజీ ని అడిగితే నాతో చేతిలో 500 కూడా లేదు అంటున్నాడు. ఒక ఆశ్రమాన్ని నడిపే వ్యక్తి వద్ద 500 రూపాయలు కూడా లేవంటే విచిత్రంగా ఉంది. కానీ చివరి క్షణాల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ సత్య మాస్టర్ అభిప్రాయపడ్డారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…