School Bus Driver: ఈ మధ్యకాలంలో ప్రతి పది మందిలో ఐదు మంది బాధపడుతున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య ఒకటి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ఈ గుండెపోటు సమస్య ఎంతగానో బాధిస్తోంది.ఇలా గుండెపోటు సమస్యతో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో శనివారం ఉదయం విద్యార్థులతో ఓ స్కూల్ బస్సు రోడ్డుపై వెళ్తుంది. ఆ స్కూల్ బస్సు గొండాల వద్దకు చేరుకోగానే హఠాత్తుగా ఆ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విధంగా బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడం గమనించినటువంటి విద్యార్థి భార్గవి బస్సు స్టీరింగ్ తిప్పుతూ బస్సును ఒక కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది.
ఈ విధంగా బస్సు స్తంభానికి ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థికి కూడా చిన్నపాటి గాయాలు కాలేదు. అయితే ఇది గమనించినటువంటి స్థానికులు హుటాహుటిన బస్సు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి కాస్త స్థిమితంగా ఉందని తెలుస్తోంది.
ఇలా డ్రైవర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడంతో భార్గవి అనే విద్యార్థి ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిందని లేకపోతే ఘోర ప్రమాదం చోటుచేసుకునేది అంటూ నేటిజన్స్ విద్యార్థి భార్గవి పై ప్రశంసల కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…