ఏమైనా కష్టాలు తీరినా.. కోరికలు తీరాలని మనకు అనిపించినా.. దేవుడికి పూజలు చేస్తాం. పూజకు సంబంధించి అన్ని సామాగ్రితో పూజలు చేస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం మాలాధారణ ధరించి పూజలు చేస్తారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల ధరించినంత మాత్రానా ఏం పని చేయకుండా ఉంకూడదు అనేది కాదు.
ఏ పని అయినా చేసుకోవచ్చు. విద్యార్థులు అయితే అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లొచ్చు. ఇక్కడ జరిగిన ఓ ఘటనలో అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి అనుమతించలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. అతడు ఇటీవల మాలధారణలో పాఠశాలకు వెళ్లాడు. మాల ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ క్లాస్ రూంలోకి రానివ్వలేదు. ఒక వేళ క్లాస్ రూంకి రావాలంటే.. ఆ మాల తీసేసి రండి అంటూ ఆదేశించారు.
ఇలా ఏం చేయలేక అతడు.. దాదాపు 40 నిమిషాల పాటు బయటనే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు పాఠశాలకు వచ్చి.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అయ్యప్ప మాలధారులు హెచ్చరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…