ఏమైనా కష్టాలు తీరినా.. కోరికలు తీరాలని మనకు అనిపించినా.. దేవుడికి పూజలు చేస్తాం. పూజకు సంబంధించి అన్ని సామాగ్రితో పూజలు చేస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం మాలాధారణ ధరించి పూజలు చేస్తారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల ధరించినంత మాత్రానా ఏం పని చేయకుండా ఉంకూడదు అనేది కాదు.
ఏ పని అయినా చేసుకోవచ్చు. విద్యార్థులు అయితే అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లొచ్చు. ఇక్కడ జరిగిన ఓ ఘటనలో అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి అనుమతించలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. అతడు ఇటీవల మాలధారణలో పాఠశాలకు వెళ్లాడు. మాల ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ క్లాస్ రూంలోకి రానివ్వలేదు. ఒక వేళ క్లాస్ రూంకి రావాలంటే.. ఆ మాల తీసేసి రండి అంటూ ఆదేశించారు.
ఇలా ఏం చేయలేక అతడు.. దాదాపు 40 నిమిషాల పాటు బయటనే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు పాఠశాలకు వచ్చి.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అయ్యప్ప మాలధారులు హెచ్చరించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…